YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గిఫ్ట్ పేరుతో... నైజీరియన్ వల

గిఫ్ట్ పేరుతో... నైజీరియన్ వల

గిఫ్ట్ పేరుతో... నైజీరియన్ వల
విశాఖపట్టణం, నవంబర 20, 
సాగరతీర నగరం విశాఖలో నైజీరియా గ్యాంగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. అమ్మాయిలతో అమాయకులకు వల వేసి గిఫ్ట్‌ల పేరుతో మోసం చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు.. నైజీరియాకు చెందిన గ్యాంగ్ కొద్దిరోజులుగా విశాఖలో మోసాలకు పాల్పడుతోంది. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ షిప్‌ పేరుతో అమాయకులకు వేస్తోంది. గిఫ్ట్‌ల పేరుతో ఫేక్ ఫోన్ కాల్స్ చేసి.. మాయ మాటలు చెప్పి నిండా ముంచుతున్నారు.నగరానికి చెందిన ఎంఎంటీసీ రిటైర్డ్ ఉద్యోగికి ఓ మహిళ పేరుతో ఫోన్ కాల్ రాగా.. గిఫ్ట్‌, డబ్బు పంపుతున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల తర్వాత ఓ పార్శిల్ వచ్చిందని.. ఆ పార్శిల్ ఇవ్వాలంటే చార్జీలు చెల్లించాలని మరోసారి మహిళ ఫోన్‌ చేసి చెప్పింది. నిజంగానే తనకు గిఫ్ట్ వచ్చిందని నమ్మిన బాధితుడు.. వాళ్లు చెప్పిన అకౌంట్‌కు రూ.లక్షల్లో డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. డబ్బు పంపించినా గిఫ్ట్ రాకపోవడంతో.. తాను మోసపోయానని గుర్తించాడు.బాధితుడు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. మహిళ ఫోన్‌ చేసిన నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. ఢిల్లీలో హర్యానాకు చెందిన కిషన్‌లాల్‌, ఇద్దరు నైజీరియన్లు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ షిప్ పేరుతోనూ మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి రూ.2లక్షలు, 95 సిమ్ కార్డులు, పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts