YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఇటుక బట్టీల నిర్వహాకులపై మండిపడ్డ ఎమ్మెల్యే

ఇటుక బట్టీల నిర్వహాకులపై మండిపడ్డ ఎమ్మెల్యే

ఇటుక బట్టీల నిర్వహాకులపై మండిపడ్డ ఎమ్మెల్యే
అనంతపురం 
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం గ్రామ సమీపాన సాగర్ ఇటుక బట్టీలో    బాలకార్మికులతో వెట్టి చాకిరి  చేపిస్తున్నారని తెలుసుకున్న  ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు.ఎమ్మెల్యేలు జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ..తక్కువ డబ్బులు కోసం ఒరిస్సా కూలీలతో వెట్టిచాకిరి చేపిస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఇటుకల బట్టిని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒరిస్సా కూలీలతో ఎమ్మెల్యే మాట్లాడారు ఇటుక బట్టీలో కూలీలకు సరైన సదుపాయాలు కల్పించడమే కాకుండా తక్కువ డబ్బులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నరని ఇటుకుల బట్టి ఓనర్ పై ఎమ్మెల్యే మండిపడ్డారు. తక్షణమే ఇటుకుల బట్టి ఓనర్ పై చట్టపరమైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఒరిస్సా కూలీలను వెంటనే తమ రాష్ట్రానికి  పంపేందుకు  అన్ని విధాలైన సదుపాయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Related Posts