YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సిద్ధిపేటలో దారుణం

సిద్ధిపేటలో దారుణం

సిద్ధిపేటలో దారుణం
మెదక్, నవంబర్ 22
జిల్లాలో దారుణం జరిగింది. కొండపాక మండలం ఖమ్మంపల్లిలో బావమరిది కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో బావ. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని హుటా హుటిన సిద్ధిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈఘటనలో గాయపడిన వారిని విమల, సునీత, జాన్‌రాజ్, రాజేశ్వరి, సునీతలుగా గుర్తించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.కొద్దిరోజులుగా లక్ష్మీరాజ్యం తన భార్యతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో బావమరిది జాన్‌రాజ్ తన బావకు సర్థిచెప్పే ప్రయత్నం చేయగా ఆ గొడవ మరింత వివాదంగా మారినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బావమరిదిపై కక్ష పెట్టుకున్న బావ లక్ష్మీరాజ్యం.. ఆ కుటుంబం ఇంట్లో ఉన్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితులు అరుపులు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్‌కు వెళ్లారు. కేసు నమోదు చేసి.. స్థానికుల్ని ప్రశ్నించారు.. ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. పరారీలో ఉన్న నిందితుడు లక్ష్మీరాజ్యం కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts