YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుపై ముప్పేట దాడి

చంద్రబాబుపై ముప్పేట దాడి

చంద్రబాబుపై ముప్పేట దాడి
గుంటూరు, ఫిబ్రవరి 14
చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్. ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువని.. ఇంకా పెద్ద కుంభకోణాలు చాలా ఉన్నాయన్నారు. త్వరలోనే అవన్నీ కూడా బయటపడతాయి అన్నారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో బాబు, ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలు అయ్యిందన్నారు. ఐటీ సోదాలపై స్పందించిన గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎప్పుడూ నీతి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడేం సమాధానం చెబుతారని గిరి ప్రశ్నించారు. ఇంత జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. బాబు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని.. కేంద్రం జోక్యం చేసుకుని చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు అండ్ కోపై నిస్పక్షపాతంగా విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయన్నారు గిరిధర్. ఇంత జరుగుతున్నా ఎల్లో మీడియా కనీసం స్పందించడం లేదని.. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో బాబు ఘనుడని.. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆరోపించారు మద్దాలి గిరిధర్. మద్దాలి గిరిధర్ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నుంచి గెలిచారు. రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి.. వైఎస్సార్‌సీపీకి జైకొట్టారు

Related Posts