రాజ్యసభ ఎన్నికలు వాయిదా..?
న్యూ డిల్లీ, మార్చి 24
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడి కోసం మార్చి 31 వరకు లాక్ డౌన్ అయిన రాష్ట్రాలు.ఎన్నికలు వాయిదా వేయాలని సీఈసీ కి లేఖ రాసిన గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు.దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు జరగాల్సి ఉన్న ఎన్నికలు.మార్చి 26 న జరగాల్సి ఉన్న రాజ్యసభ ఎన్నికలు.ఇప్పటికే ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఏకగ్రీవంగా సభ్యుల ఎంపిక.ఏప్రిల్ 2, 9,12 తేదీల్లో ముగుస్తున్న 55 మంది ప్రస్తుత రాజ్యసభ సభ్యుల పదవీ కాలం.ఏపీ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణ లో రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు.