YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గుత్తి రైతుకు చిక్కిన వజ్రం

గుత్తి రైతుకు చిక్కిన వజ్రం

గుత్తి రైతుకు చిక్కిన వజ్రం
అనంతపురం  మే 22
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఓ రైతుకు విలువైన వజ్రం చిక్కిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ శివారులో ఊటకల్లుకువెళ్లే దారిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి భూమి పదును కావడంతో రైతు సేద్యం పనులు చేశాడు. గుంటకతో భూమిని దున్నడంతో ఓ వజ్రం చిక్కింది. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులతో కలిసి వజ్రాన్ని కర్నూలు జిల్లా పెరవలిలో విక్రయించేందుకు ప్రయత్నించగా అక్కడ ధర వద్ద తేడా వచ్చింది. దీంతో గుత్తి ఆర్‌ఎస్‌లోని ఓ వ్యాపారికి 30 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. కాగా ఆ వజ్రం కోటికి పైగా ధర ఉంటుందని సమాచారం. మధ్యవర్తులు వజ్రాల వ్యాపారితో కుమ్మక్కై రైతుకు తక్కువ ధర ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.

Related Posts