YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కొత్త ఫార్ములాతో నితీష్ పాట్నా,

కొత్త ఫార్ములాతో నితీష్ పాట్నా,

కొత్త ఫార్ములాతో నితీష్
పాట్నా, 
బీహార్ అంటేనే కులాలు కుమ్ములాటలు. ప్రధానంగా బీహార్ రాజకీయాల్లో కులాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ వెనకబడిన వర్గాలు, దళితులు, ముస్లిం ఓటర్లు ఎక్ుకవగా ఉన్నాయి. ముఖ్యంగా యాదవులు, ముస్లింలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. యాదవులు, ముస్లింల ఓట్ల సంఖ్యే దాదాపు ముప్ఫయి శాతంగా ఉంది. అందుకే బీహార్ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఈ రెండు సామాజికవర్గాలపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తాయి.ముస్లిం, యాదవుల ఓటు బ్యాంకు మూడు దశాబ్దాలుగా రాష్ట్రీయ జనతాదళ్ వైపే ఉంది. అంటే గంపగుత్తగా కాకపోయినా ఎక్కువ శాతం ఈరెండు సామాజకవర్గాల ఓటర్లు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి కూడా ఆర్జేడీ దీనిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే ఈసారి ఎలాగైనా బీహార్ ను మరోసారి చేజిక్కించుకోవాలని చూస్తున్న నితీష్ కుమార్ ఈ సామాజికవర్గాలపై కన్నేశారు.అందుకే ఈ రెండు సామాజికవర్గాలకు సీట్ల కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కూటమిలో తనకు కేటాయించిన స్థానాల్లో 19 స్థానాలను యాదవులకు కేటాయించి ఆ ఓటు బ్యాంకును నితీష్ కుమార్ కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ముస్లిం సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు 11 స్థానాలను జేడీయూ కేటాయించింది. ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు జేడీయూ కేటాయించడం ఇదే ప్రధమమని చెబుతున్నారు.ఇక మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు కూడా నితీష్ కుమార్ ప్రత్యేకంగా సీట్లను కేటాయించడం విశేషం. ఇప్పటికే బీహర్ మహిళలు నితీష్ కుమార్ పట్ల కొంత సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. మద్యనిషేధం అమలు చేస్తుండటంతో మహిళలు మళ్లీ నితీష్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అందుకే నితీష్ కుమార్ 22 మంది మహిళలకు ఈ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించారు. స్థానికసంస్థల ఎన్నికల్లోనూ మహిళలకు యాభై శాతం సీట్లను కేటాయించడంతో మహిళా ఓటు బ్యాంకు తనవైపు ఉంటుందని నితీష్ కుమార్ నమ్మకంగా ఉన్నారు. మొత్తం మీద మూడు దశాబ్దాల ఆర్జేడీ ఓటు బ్యాంకుకు నితీష్ కుమార్ గండి కొడతారా? లేదా? అన్నది చూడాలి.

Related Posts