ధరణి పోర్టల్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయచ వ్యవసాయేతర భూములవిక్రయాలకోసం రూపొందించిన ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూనిన ధరణి పోర్టల్ అందరికి గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. భూ వివాదాలకు స్వస్తి పలికి, రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ను ప్రారంభించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ ను కేసీఆర్ ప్రారంభించారు. స్తారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కంటే ముందు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.