YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ చేసే పనులకు తుగ్లక్ ను గుర్తు చేసుకోవలసి వస్తుంది మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య

కేసీఆర్ చేసే  పనులకు తుగ్లక్ ను గుర్తు చేసుకోవలసి వస్తుంది  మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్ డిసెంబర్ 28 
తుగ్లక్ ఏం పుణ్యం చేసిండో కానీ ఈ కేసీఆర్ చేసీ పనులకు ప్రతిరోజు ఆయనను గుర్తు చేసుకోవాల్సి వస్తుందని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.సోమవారం ఘంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చడు. చేసిన ఒక్క పని సక్కగా చేయడు.ప్రతిపక్షాలు, వద్దు అంటున్న మొండిగా పోతాడు బోల్తా పడతాడని ఏద్దేవ చేసారు.అహం, తెలివితక్కువ తనం, అనుభవ లోపం, పరిపాలనపై పట్టు లేకపోవడం లాంటి వాటితో తెలంగాణ ప్రజలు తీవ్ర  ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ప్రతి పనిలో లోపాలు.. ఇప్పుడు తాజాగా నియంత్రణ సాగు..వద్దు సారు అంటే వినలేదు.. ఇప్పుడు యూ టర్న్ కారు గా మిగిలిపోయిందన్నారు.మిషన్ భగీరథ అంతే 48 వేల కోట్లు అప్పులు తెచ్చి మరీ పెట్టారు. ఒక్కడన్న ఆ నీళ్లు తగుతున్నారా.. గిన్నెలు కడుక్కోవడానికి, బట్టలు ఉతకదానికి, స్నానాలకు వాడుతున్నారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అంతే లక్షకోట్లు ఖర్చు చేశారు. ఒక్క చుక్క అయిన వాడుకున్నమా..అని ప్రశ్నించారు.సచివాలయం కూల్చేశారు. వద్దు అంటే వినలేదు. మెట్రో రైల్ కోసం ఏదేదో చెప్పి మూడేళ్లు ఆలస్యం చేసి 4 వేల కోట్లు భారం మోపాడని విమర్శించారు.తెలంగాణ లో ఇప్పుడు ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత.గతంలో రైతుల వద్ద నుంచి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు రైతులకు చెయ్యిచాడు కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాలకు అనుకూలంగా నిర్ణయం ఉన్నట్టుంది.ధరణి వెబ్సైట్ లో తప్పుల తడకల్తో రైతులకు గందరగోళం. ఇప్పటికే తమ భూమి రికార్డ్ లో లేదని కొంతమంది రైతుల ఆత్మహత్యలు..ఎల్లారెస్ విషాయంలో తీవ్ర గందరగోళం రియల్టర్లు ఉద్యమం ఎటు తేల్చుకోలేక పోతున్న ప్రభుత్వం.సీఎం కేసీఆర్ అవివేకం, అహంకారం, అనాలోచిత నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు..కొనుగోలు కేంద్రాల ను రాత్రికి రాత్రే ఎత్తేస్తామని ప్రకటించారు.కేసీఆర్ చర్యల వల్ల రాష్ట్ర రైతాంగం ప్రమాదంలో పడుతుంది.కేసీఆర్ కు ప్రజలు తగిన శిక్ష విధించడం ఖాయంమిషన్ భగీరథకు 50 వేల కోట్లు ఖర్చు చేశావు.. కదా నీళ్లు ఇచ్చావా..కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి రెండు ప్రాజెక్టులకు లక్ష కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేశారు. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు.కేసీఆర్ రాష్ట్ర ద్రోహి గా మిగిలిపోతారన్నారు..కేసీఆర్ తీసుకునే 90శాతం నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేసేవే.కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడాన్ని .. ప్రజల్లో ఎండగడుతాం.కేసీఆర్, బీజేపీ ఆడే నాటకాలతో.. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలు లోనే..నన్నారు.

Related Posts