న్యూఢిల్లీ జనవరి 11
అరేబియా సముద్రంలో ఓ మత్స్యకారుల బోటు అగ్నిప్రమాదానికి గురైందిబోటులోని సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఒక మత్స్యకారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే తీర రక్షక దళం బృందాలు అక్కడికి చేరుకుని 11 మంది మత్సకారులను రక్షించారు. తమిళనాడుకు చెందిన 11 మంది మత్స్యకారులు ఇటీవల బోటులో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే ఆదివారం తెల్లవారుజామున బోటులోని సిలిండర్ పేలడంతో మంటలు అంటుకున్నాయి. దాంతో బోటులోని మత్స్యకారులు ముంబైలోని మ్యారీటైమ్ రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్కు సమాచారం అందించారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన తీర ప్రాంత రక్షణ దళం . 11 మంది మత్స్యకారులను కాపాడి తీరానికి చేర్చింది. తీవ్రంగా గాయపడి మత్స్యకారుడిని ఆస్పత్రిలో చేర్చింది. . కర్ణాటకలోని మంగళూరు తీరానికి పశ్చిమంగా 140 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.