YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీబీనగర్ లోనే ఎయిమ్స్...!!

బీబీనగర్ లోనే ఎయిమ్స్...!!

మూడున్నర సంవత్సరాల పోరాటంతో బీబీ నగర్ లో  ఎయిమ్స్ కేంద్రం ఓకే  చెప్పడంతో ఆ ప్రాంతాల్లో  ఆనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయి. ఎయిమ్స్ కు  కేంద్ర ఆర్థికశాఖ రూ. 3,400 కోట్లు ఎయిమ్స్ కోసం కేటాయించగా.... 2015లోనే సీఎం కేసీఆర్ బీబీనగర్‌కు విచ్చేసి ఎయిమ్స్ ఇస్తామని చేసిన ప్రకటన చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనేక సార్లు ఢిల్లీ పెద్దలతో జరిపిన మంతనాలు, ఒత్తిడి వల్లనే ఎయిమ్స్ సాధ్యమైందది. ఇప్పటికి సేకరించిన 160 ఎకరాలతో పాటు మరో 40 ఎకరాల స్థలం కూడా సిద్ధంగా ఉంచారు ఇక్కడి గల సాయిల్ టెస్టు కూడా పూర్తి చేశార. నిర్మాణాలకు అనువైన స్థలమని కేంద్ర వైద్యశాఖ అధికారులు నిర్దారించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నిధులు కేటాయిస్తూ ఇచ్చిన లేఖను స్వయంగా కేంద్ర ఖర్చులు, పద్దుల శాఖ సంయుక్త కార్యదర్శి సునీల్‌శర్మకు అందజేశారు. సీఎం తమపై పెట్టిన గురుతర బాధ్యతను భుజాల మీద వేసుకుని అనేక సార్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులను, వైద్యశాఖ కార్యదర్శులను కలిశామని గుర్తు చేశారు ఎంపీ నర్సయ్య గౌడ్. ఎక్కడ విసుగు పడకుండా ఎన్నోసార్లు ఎయిమ్స్‌పై పోరాటం చేసిన స్థాయిలో స్పందించిన ఫలితంగా నిధుల విడుదల చేశారన్నారు వైద్యరంగంలో వినూత్న పోకడలకు ఎయిమ్స్ కేంద్రంగా కానుంది. మొదట్లో తెలంగాణకు ఎయిమ్స్ అవసరం లేదని కేంద్ర వైద్య శాఖ నిర్ధారించిందని గుర్తు చేశారు. దీనిపై అనేక పోరాటాలు చేసి రెండు సంవత్సరాల క్రితం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో ప్రకటన వెలువడేలా చేశామని  చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ కావాలని తెలంగాణకు ఆలస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ ఏర్పాటుకు స్థలం సిద్ధంగా ఉంది. రైలు, రోడ్డు, విమాన సర్వీసులు సులభంగా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల బీబీనగర్‌లో ఎయిమ్స్ చేయడం అనువైనదిగా  వివరించారు. ముఖ్యమంత్రి నిర్ణయం వెలువడిన తర్వాతనే ఎక్కడ ఏర్పాటవుతుందనే విషయం ఖాయమవుతుందని తెలిపారు. మూడు నాలుగు నెలల్లో కార్యాచరణ ప్రణాళిక అమలవుతుందని చెప్పారు.

Related Posts