YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వారం పది రోజుల్లో రైతు భరోసా విడుదల

వారం పది రోజుల్లో రైతు భరోసా విడుదల

గజ్వెల్
గజ్వెల్ పట్టణంలో  ఇందిరమ్మ గృహల 2 వ విడుత 2938 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు ప్రొసీడింగ్స్ ను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అందించారు
ఈ సందర్బంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఆనాడు ఇందిరమ్మ పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లను అందించి పేద ప్రజల గుండెల్లో నిలిచారు. పేద ప్రజల అభివృద్ధికి సీఎం కంకణం కట్టుకున్నారు కోవిడ్ సమయంలో వైద్యం కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే సీఎం రిలీఫ్ ఫండ్  రిలీప్ పండు ద్వారా ఇస్తున్నామని అన్నారు.
900 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము. గజ్వేల్ నియోజకవర్గంలో  200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తా.  సన్న వడ్లకు  500 రూపాయల బోనస్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. మానిఫెస్టోలో లేలున్న 13 వేల కోట్ల తో సన్నబాయ్యం పంపిణీ చేస్తున్నాం.  వర్షాకాలంలో పేద ప్రజలు ఇబ్బంది పడరాదని చౌక ధరల దుకాణాల ద్వారా ఒకే సారి 3 నెలల సన్న బియ్యం  పంపిణీ చేస్తున్నాము.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతు భరోసా సాయం వారం పది రోజుల్లో రైతులందరికీ ఖాతాలోకి వస్తుంది. సొంతం ఇల్లు ఉండాలనే పేద ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా బీద ప్రజలకు సాయం చేయాలనే  ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని అన్నారు.
5 లక్షలతో 600 ఫీట్ల వరకు మాత్రమే ఇళ్ళు నిర్మించుకోవాలి.  దరఖాస్తు చేసుకున్న అర్హులు అందరికీ  రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుంది. విద్య, వైద్య, ఇండ్లు, ఇరిగేషన్,  మౌలిక వసతులు కల్పన తదితర అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉన్న మెదక్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రిగా జిల్లా అభివృద్ధి చేస్తా. దాదాపు 3000 ఇండ్లు గజ్వెల్ లో సాంక్షన్ చేసాము 600 చదరపు ఫీట్ల కంటే ఎక్కువ కట్టుకోరాదు. 200 ఉచిత విద్యుత్ యూనిట్ల స్కీమ్ కింద రాని వారు అప్లయ్ చేసుకువాలి. 500 గ్యాస్ స్కీమ్ రాని అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాలి.  జిల్లాలో సమస్యలుంటే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
జిల్లా కలెక్టర్ కే. హైమవతి మాట్లాడుతూ  సొంత ఇంటిని కలిగి ఉండడం ప్రజలందరికీ కల ఆ కలను నెరవేరుస్తున్న  రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రజల పక్షాన ధన్యవాదాలు.  ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఇండ్లను ఆరు నెలల పూర్తిచేసుకుని పండుగ వాతావరణంలో  గృహప్రవేశాలు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లు గరీమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్, గాజ్వెల్ ఆర్డీఓ చంద్రకళ, హోసింగ్ పీడీ దామోదర్ రావు, గాజ్వెల్ ఏఎంసి చైర్మన్ నరేందర్ రెడ్డి, వంటిమామిడి ఏఎంసి చైర్మన్ విజయ మోహన్, కుకునూరుపల్లి ఏఎంసి చైర్మన్ శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts