YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్థానికంలో ట్విస్ట్లు లు మీద ట్విస్టులు

స్థానికంలో ట్విస్ట్లు లు మీద ట్విస్టులు

విజయవాడ, ఫిబ్రవరి 1, 
కొంత కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు విపరీత ధోరణులకు దారి తీస్తున్నాయని స్పష్టంగానే తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ వైకాపా.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల మధ్య యవ్వారం తీవ్ర పరిణామాలకే దారితీసింది. ఒకానోక సమయంలో రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల కమిషనర్ ను సైతం ప్రభుత్వం విధుల నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వంపై నిమ్మగడ్డ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ..నిమ్మగడ్డను మధ్య చోటుచేసుకున్న ఈ అంశంతో పాటు పలు ఇతర విషయాలకు సంబంధించి కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి. అయితే, వీటిలో న్యాయస్థానాల తీర్పులు నిమ్మగడ్డకు అనుకూలంగా రావడంతో అధికార పార్టీ వైకాపాపై గాయం మీద కారం చల్లినట్టుగా కావడంతో మరింత అగ్గి రాజుకుంది. అసలు నిమ్మగడ్డకు.. ప్రభుత్వాన్ని ఎందుకు ఈ అగాధాలు ఏర్పాడ్డాయి? ప్రభుత్వం ఆయన తీరుపట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? నిమ్మగడ్డ.. జగన్ సర్కారును నిజంగానే టార్గెట్ చేశారా? అలా ఎందుకు? పంచాయతీ ఎన్నికలు.. కరోనా పరిస్థితులు.. రాజకీయ పార్టీలు.. నేతలు తీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనారిగా ఉంటాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్ఫుడు రాష్ట్ర ప్రజల మదిలో మెదులుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ 1982 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బ్యాచ్ అధికారి. ఆయన తన సుదీర్ఘ కెరీర్‌లో వివిధ విభాగాలలో పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2016 ఏప్రిల్ 1న ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. రాజ్యాంగబద్ధమైన పదవి ఎస్ఈసీ గా కొనసాగుతున్న నిమ్మగడ్డ, ప్రజలచే ఎన్నుకోబడి వైకాపా ప్రభుత్వం మధ్య చిలికి చిలికి గాలివానలా ఇరువురి వైరం మారిందని చెప్పాలి. రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడం.. సహజంగానే అధికారపార్టీకి ఉండే కొన్ని ప్రత్యేక వెసులుబాటుల మూలంగా వారు అత్యధికస్థానాలల్లో ఏకగ్రీవంగా గెలుచుకోవడం, ఆ వెనువెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేయటం.. నిమ్మగడ్డపై అధికారి పార్టీ నేతలు తీవ్రంగా మిర్శలు చేయడం చకచక జరిగిపోయాయి.ఇక అధికార పార్టీ నేతలతో పాటు స్వయంగా సీఎం జగనే నిమ్మగడ్డపై.. విమర్శలు చేస్తూ… చంద్రబాబు మనిషి కావడంతోనే ఏన్నికలు వాయిదా వేశారంటూ ఆరోపించారు. దీనిని సీరియస్ గా తీసుకున్న నిమ్మగడ్డ.. సీఎం జగన్ ఫ్యాక్ష‌నిస్ట్ అంటూ కేంద్రం ఎన్నికల సంఘాని లేక రాయడం తీవ్ర దుమారమే రేపింది. మరీ ముఖ్యంగా అప్పటి టీడీపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావులతో నిమ్మగడ్డ ఓ హోటల్లో రహస్యంగా సమావేశం కావడం.. దీనికంతటికి కారణం టీడీపీనే అనీ… నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తు అంటూ వైకాపా నేతలు తీవ్రంగానే స్పందించారు.ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారుకు.. నిమ్మగడ్డకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. ఇక జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డలొల్లిని ఎలాగైనా తొలగించుకోవాలనే క్రమంలో ఓ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ పదవి నుండి నిమ్మగడ్డను తొలగించి తమిళనాడుకు చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే, నిమ్మగడ్డ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయనకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు వచ్చింది. ఎలాగు 2021లో నిమ్మగడ్డ రిటైర్ అవుతారులే అనుకుని ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించేకోలేదు. అయితే, సర్కారు తీరుపై అప్ప‌టికే గరంగరంగా ఉన్న నిమ్మగడ్డ.. ఎలాగైనా తాను రిటైర్ అయ్యేలోపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జ‌రపాల‌ని కంకణం కట్టుకున్నట్టు ముందుకు సాగారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మగడ్డ ఉన్నకాలంలో ఎన్నికలు జరగకూడదని జగన్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది.

Related Posts