చిత్తూరు ఫిబ్రవరి 8,
చిత్తూరు జిల్లా మదనపల్లె లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మదనపల్లె స్థానిక అప్పారావు వీధిలో వున్న ప్రదీప్ ట్రేడర్స్ లో ఘటన జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరగిఉండచ్చని ప్రాదమిక నిర్థారణలో తేలింది. ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. నిత్యావసర సరుకులు భారీగా తగలబడ్డాయి. ప్రమాదం జరిగిన భవనంలో ఆయిల్ సంపులు ఉండటంతో అధికారులు, స్థానికులు తీవ్ర అందోళనలో పడ్డారు. ఒక కోటి రూపాయలు ఆస్తి నష్టం పైగా ఉండవచ్చని సమాచారం. రెండు పైర్ ఇంజన్లతో పైర్ సిబ్బంది మంటలను అతికష్టంతో అదుపులోకి తెచ్చారు.