కలెక్టర్ నివేదికతో ఈటెలను మంత్రి వర్గం నుంచి తొలగించిన సీఎం. ఆ విధంగా లేఖ పంపిన వెంటనే ఆమోదించిన తెలంగాణ గవర్నర్. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచనలం అవుతోందా. అచ్ఛంపేటలో అరవైఆరు ఎకరాల అసైన్డ్ భూములను మంత్రి ఈటెల కబ్జా చేసారని కలెక్టర్ నివేదిక చెప్తోంది. అలానే అనేక చెట్లను అనుమతి లేకుండా నరికివెయ్యటం పై అటవీ శాఖ ముఖ్యమంత్రికి నివేదించారు.
ఈ చర్యలతో బీజేపీ మరియు ఇతర ప్రతిపక్షాలు మిగతా మంత్రులపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకోపోతున్నారని గట్టిగ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆఘమేఘాలుగా ఈటెలను తొలగించడం తెలంగాణలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెపుతున్నారు.