YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

చేప మందు లేనట్టే

 చేప మందు లేనట్టే

హైదరాబాద్, మే 31, 
చేపమందుకు ఈ ఏడాది కూడా బ్రేక్ పడింది. కరోనా నేపథ్యంలో చేప మందును నిలిపి వేశారు. జూన్ 8వ తేదీనచేప మందు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో చేప మందు పంపిణీ చేయడం లేదనీ బత్తినీ హరినాథ్ గౌడ్ ప్రకటించారు. ఈ సారి చేప మందు ను తామే ఇంట్లో అందరం తీసుకుంటామని బత్తిని ప్రకటించాడు. చేప మందు కోసం ఎవరు కూడా హైదరాబాద్ రావద్దని ప్రకటించారు.ప్రతీ ఏడాది మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేప మందు పంపిణీని ఈ ఏడాది అందజేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ వెల్లడించారు.ఈ చేప మందు వేసుకోడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబీకులు 173 సంవత్సరాలుగా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.

Related Posts