YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దేశంలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

దేశంలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

న్యూఢిల్లీ
 దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి.  మరణాల సంఖ్య కుడా పెరిగింది.  మంగళవారం నాడు లక్షా 27 వేల కేసులు నమోదు కాగా బుధవారం నాడు  లక్షా 32 వేల కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కొత్తగా 1,32,788 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం కరోనా బులెటిన్లో తెలిపింది. 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,207.
మరోవైపు,  కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,31,456 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,61,79,085 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21,85,46,667 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

Related Posts