YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చేతబడి నెపంతో ఘర్షణ…ఇద్దరు మృతి

చేతబడి నెపంతో ఘర్షణ…ఇద్దరు మృతి

విశాఖపట్నం
విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి నెపంతో రెండు కుటుంబాలు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయా రు. మరి కొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. అనంతగిరి మండలం టోకూరు పంచాయితీ బక్మర్ వలస గ్రామంలో ఘటన జరిగింది. గ్రా మంలో కిల్లో కోమటి అనే గిరిజనుడుని హత్య చేశారు ప్రత్యార్థి సుబ్బారావు కుటుంబం. కత్తితో పొడిచి చంపేసారు. దింతో ఆగ్రహంతో ఉగిపోయిన బాదిత కుటుంబం.. సుబ్బారావు కుటుంబంపై తిరుగుబాటు చేసింది. ఆయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు.
ఈ ఘటనల్లో ప్రత్యార్థి సుబ్బారావు కు తీవ్రగాయాలాయ్యాయి. ఆసుపత్రికి తరలించగా సుబ్బారావు మృతి చెందా డు. ఇక తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కోమటి కొడు కులు భగవాన్, బలరాం.అయితే.. దాడికి పాల్పడిన సుబ్బారావు కొడుకు డొంబు పారిపోవడంతో అతని ఇంటిని ధ్వంసం చేశారు స్థానికులు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులో కి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. ఇరు కుటుంబాలకు చెందిన పలువురుపై కేసు నమోదు చేసిన పోలీ సులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Posts