YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బుధవారం కర్నూలులో సీఎం జగన్ పర్యటన

బుధవారం కర్నూలులో సీఎం జగన్ పర్యటన

కర్నూలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి పర్యటన షెడ్యూలు అందింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. ఆయన 22వ తేదీ ఉదయం 11.15కు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.25 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలు మండలం పంచలింగాల మాంటిస్సోరి పాఠశాల పరిసరాల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో 15 నిమిషాలపాటు ముఖాముఖి కానున్నారు. 11.55 గంటలకు వివాహ వేదిక వద్దకు సీఎం చేరుకుంటారు. 15 నిమిషాలపాటు వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం   12.10కు వివాహ వేదిక నుంచి రోడ్డుమార్గంలో హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.30కు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని విమానంలో వెళతారు

Related Posts