YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా సర్కార్ పై తాడో పేడో

వైకాపా సర్కార్ పై తాడో పేడో

రాజమహేంద్రవరం
ఈ ప్రభుత్వం పై తాడోపేడో తేల్చుకుంటాం. ప్రజలంతా  వైసిపి పాలన అంటే విసుగుచెందారు.  యువతకు ఉద్యోగాలు ఇవ్వరు. ఉన్న ఉద్యోగులకు జీతం  ఒక అందని ద్రాక్ష అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. బడుగులంటే  ఈప్రభుత్వానికి చులకన. కేవలం కేంద్ర పధకాలకు పేర్లు మార్చుకుని  కాలం వెళ్లదీసే ప్రభుత్వంగానే ప్రజలకు కనపడుతోంది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. ప్యాలెస్ పరిపాలనలో ప్రజల సమస్యలు వినే నాధుడే లేడు. అనేక సమస్యల పై ముఖ్యమంత్రికి లేఖలు రాయడం జరిగింది అయినా స్పందనలేదు. ఈ ప్రభుత్వానిది తోలు మందం వ్యవహారంలా ఉంది. అభివృద్ది శూన్యం. మత్య్సకారులకు సంబంధించి 217 జిఓ పై భారతీయ జనతాపార్టీ మాత్రమే స్పందించి నెల్లూరు జిల్లాలో  మత్య్సకార గర్జన సభ పెట్టడం జరిగింది. 50వేల కోట్ల తో కేంద్ర ప్రభుత్వం ఎపిలో జాతీయ రహదారుల అభివృద్ధి చేశాం ఈ ప్రభుత్వం చిన్న గుంతకూడా పూడ్చలేదు. ఫ్యామిలీ పార్టీ లది అవినీతి లక్ష్యం. హిందువుల వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ది. దమ్ముంటే చర్చ కు రండి. సహకార రంగంలో పంచదార మిల్లు లు  అమ్మేయలేదా. ఇదే విషయం జగన్ ,చంద్రబాబు చర్చ కు సిద్దమా. హిందువులు సామూహికంగా నిర్వహించుకునే వినాయక చవితి పండుగలాంటి వచ్చిన సందర్భంలో  ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై  బిజెపి మాత్రమే రోడ్డు ఎక్కి పోరాటాలు చేశాం. అన్ని రాష్ట్రాల్లో కేంద్రం తో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తే  వైసిపి ప్రభుత్వం ధరలు తగ్గించడం మాని ఎందుకు ధరలు తగ్గించాలంటూ లక్షలు కుమ్మరించి  పత్రికల్లో యాడ్స్ ఇచ్చిన వైనం పరిశీలిస్తే  ఇదొక సైకో ప్రభుత్వంగా ప్రజలకు కనపడుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు నెలజీతం దినదిన గండంగా మారిన పరిస్థితి వైసిపి ప్రభుత్వంలో నే చూస్తున్నామని అన్నారు.
బిసి గణన అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు  దఖలు పరుస్తు 127 రాజ్యంగ సవరణ ద్వారా  కేంద్ర దఖలు పరిస్తే బిసి గణన చేయడానికి ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పారిశుధ్య కార్మికులకు జీతాల బకాయిలు గురించి రోడ్డెక్కే పరిస్థితి. ప్రకృత్రి  వైపరిత్యాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఇంతవరకు ఆదుకోలేదు.  అర్భన్ హెల్త్ సెంటర్లలో  20 సంవత్సరాల నుండి పని చేస్తున్న సిబ్బందిని తొలగించారు వీరంతా ఆరోగ్య మంత్రి చుట్టు తిరిగినా ఇంతవరకు ఫలితం లేని పరిస్థితి ఏర్పడింది. గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న  ఉద్యోగులకు పేస్కేల్ ఎందుకు వర్తింప చేయరు  ఈ ప్రభుత్వాన్ని  ఎన్ని సార్లు అడగాలి. ఏ సమస్యపైనా కూడా ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడరు  కేవలం సలహాదారులు మాత్రమే మాట్లాడతారు. ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలోకి వచ్చినట్లు  వైసిపి భావించడం లేదు కేవలం ఈ రాష్ట్రాన్ని లీజుకు తీసుకున్నట్లు గా వీరి వ్యవహారం కనపడుతోందని అన్నారు.

Related Posts