YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైఎస్సార్ కు నివాళులర్పించిన సీఎం జగన్

వైఎస్సార్ కు నివాళులర్పించిన సీఎం జగన్

ఇడుపులపాయ
మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి 2వ రోజు శుక్రవారం ఉదయం 9.35గంటలకు డాక్టర్ వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని డా.వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.   ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్ భాష, జిల్లా ఇంఛార్జి మంత్రి  ఆదిమూలపు సురేష్, మత్స్య శాఖ మంత్రి అప్పలరాజు,  ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు, ఎస్పి కేకేఎన్ అన్బురాజన్, పాడా  ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇడుపులపాయలోని డాక్టర్ వైయస్ఆర్ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ముఖ్యమంత్రి  తల్లి వైయస్ విజయమ్మ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.  కోవిడ్ నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (SoP) మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Related Posts