YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అడుగ‌డుగున అద్బుతాలు…మ‌హాబ‌లేశ్వ‌రం ఆల‌యాలు.!!

అడుగ‌డుగున అద్బుతాలు…మ‌హాబ‌లేశ్వ‌రం ఆల‌యాలు.!!
మహాబలిపురం.. తమిళనాడులోని చెన్నైకి దక్షిణాన సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా పురాతనమైన పట్టణం. క్రీస్తు శకం 7 నుంచి 9వ శతాబ్దాల నడుమ దీన్ని పల్లవులు నిర్మించారు. అప్పట్లో ఈ పట్టణం చక్కని పర్యాటక ప్రదేశంగా ఉండేది. ఇక్కడి రాతి ఆలయాలు, వాటిపై ఉండే శిల్పకళ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
చరిత్ర
7 వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.
మరొక కథనం ప్రకారం అప్పట్లో ఈ పట్టణాన్ని మహాబలి అనబడే ఓ రాక్షస రాజు పరిపాలించేవాడట. పేరుకు రాక్షస రాజే అయినా అతనిది చాలా జాలి గుండెనట. ఈ క్రమంలోనే అతని పేరిట ఈ పట్టణానికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చెబుతారు. దానికి అంతకుముందు మామళ్లపురం, కడల్‌మలై అనే పేర్లు కూడా ఉండేవట. కడల్‌మలై అంటే పర్వతాలు, సముద్రంతో కూడిన ప్రదేశం అని అర్థం.ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు దర్శనమిస్తాయి. అందులోని శిల్పాలను చూస్తే పురాతనకాలంలోనే రాకెట్ ప్రయోగాలకు నాంది పలికారని అనిపిస్తుంది.
మహాబలిపురం మొత్తం 7 ఆలయాలు కలిపి ఒకే ఆలయంగా ఉండేవి. కానీ అందులో 2 ఆలయాలు సముద్రంలో మునిగిపోగా, ప్రస్తుతం 5 ఆలయాలు మాత్రమే బయటకు ఉన్నాయి. అవే మనకు కనిపిస్తాయి. అయితే సముద్రంలో మునిగిన ఆ ఆలయాల శిఖరాలను బోటులో వెళ్లి చూడవచ్చు. అందుకు గాను బీచ్‌ నుంచి బోటు సౌకర్యం అందుబాటులో ఉంది.
ప్రస్తుతం మనకు కనిపించే ఆ 5 ఆలయాలను దూరం నుంచి చూస్తే రథాలలా ఉంటాయి. అవి పాండవులకు చెందిన 5 రథాలే అని చెబుతారు.
ఈ ఆలయాలను నిర్మించేందుకు సుమారుగా 200 ఏళ్లు పట్టిందట. మొత్తం 3 తరాలకు చెందిన పల్లవ రాజులు ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారట.
ఆ 5 ఆలయాల్లో సముద్రానికి దగ్గర్లో ఉన్న ఆలయం ముఖ్యమైందిగా చెబుతారు. దీన్ని చాలా పకడ్బందీగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాలు అన్నింటినీ కేవలం ఏకశిలతోనే నిర్మించారు.
ఆనాటి రాజుల కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా వుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి అందరు శిల్పులు, నిపుణులు పరవశించిపోతారు. వాటిలో ప్రధానమైనవి శ్రీకృష్ణుని రాయి. దీనినే కృష్ణాస్ బట్టర్ బాల్ అని పిలుస్తారు. ఇది కృష్ణుడు ఆడుకున్న రాయి అని చెబుతారు. ఇది గుండ్రంగా ఉంటుంది. బల్లపరుపుగా ఉన్న మరో రాయిపై బ్యాలెన్స్‌ అయి ఉంటుంది. కిందకు దొర్లినట్లు దూరం నుంచి చూస్తే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటికీ దొర్లలేదు. అలాగే ఉంది. ఇది సైంటిస్టులకు ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే మారింది.
ఈ రాయి ఎత్తు 20 అడుగులు కాగా వెడల్పు 5 మీటర్లు. బరువు 250 టన్నుల వరకు ఉంటుంది. అయితే ఈ రాయిని అక్కడకు తీసుకువచ్చి పెట్టారా.. అదే సహజసిద్ధంగా అక్కడ ఏర్పడిందా.. అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ సుమారుగా 1200 ఏళ్ల నుంచి ఆ భారీ రాయి అక్కడ అలాగే ఉంది. ఇది నిజంగా విశేషమే.
ఈ రాయిని తమిళంలో వానిరైకల్‌ అని పిలుస్తారు. అంటే స్టోన్‌ ఆఫ్‌ ది స్కై గాడ్‌ అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ఒల్లాంటయ్‌టంబో, పెరు, మచ్చు పిచ్చులలో ఉన్న భారీ ఏకశిలలకన్నా ఈ రాయి చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది.
సైన్స్‌ ప్రకారం చూస్తే.. ఈ తరహా రాయిని అలా బ్యాలెన్స్‌ చేసి ఉంచడం చాలా కష్టం. ఈ రాయి ప్రస్తుతం కేవలం 4 అడుగుల ప్రదేశంలో బ్యాలెన్స్‌ చేయబడి ఉంది. అది కూడా కొండ లాంటి ప్రదేశంలో. అంతటి భారీ రాయి అంత తక్కువ ప్రదేశంలో ఎలా బ్యాలెన్స్‌గా ఉందా అని భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు. సాధారణంగా అలాంటి రాళ్లు కిందకు జారుతాయి. కానీ ఈ రాయి 1200 ఏళ్ల నుంచి అక్కడ అలాగే కదలకుండా ఉండడం.. నిజంగా ఆశ్చర్యమే మరి.
1908వ సంవత్సరంలో అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ ఆర్థర్‌ లాలీ ఆ రాయిని చుట్టు పక్కల నివాసితులకు ప్రమాదకరంగా ఉందని భావించి దాన్ని అక్కడి నుంచి తొలగించాలని అనుకున్నాడు.

Related Posts