YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుధాకర్ రెడ్డి మెమోరియల్ టోర్నమెంట్

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుధాకర్ రెడ్డి మెమోరియల్ టోర్నమెంట్

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు స్వర్గీయ సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో బ్యాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, జివిఎంసి కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు, జాతీయ క్రీడాకారిణి కార్పొరేటర్ ఉషశ్రీ, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ పాల్గొని, బ్యాట్మెంటన్ టోర్నమెంట్ ను  ప్రారంభించారు.
ముందుగా సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ అకాడమీ కోచ్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో స్వర్గీయ సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, క్రీడల పట్ల యువతకు ఆ శక్తిని పెంపొందించే విధంగా సుధాకర్ రెడ్డి కష్టపడే వారిని గుర్తు చేశారు. ఎంతో మంది యువతకు క్రీడా స్ఫూర్తి నింపిన సుధాకర్ రెడ్డి కి ఘన నివాళులు అర్పించారు. ప్రతియేటా సుధాకర్ రెడ్డి పేరు మీద బ్యాట్మెంటన్ క్రీడా పోటీలు జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ సావిత్రి, వార్డ్అధ్యక్షులు గుని శెట్టి శ్రీనివాసరావు,గోర్లే అప్పల స్వామి నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోచ్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ  ఐదు సంవత్సరములు దాటిన పిల్లలకు కోచింగ్ ఇస్తూ స్పోర్ట్స్ లో ఉన్నత శిఖరాలకు వెళ్లే విధంగా పిల్లలను తీర్చిదిద్దుతామని చెప్పారు

Related Posts