YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ

డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ

అమరావతి
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీవేటు పడింది.  ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్  కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (1992 బ్యాచ్) ని నియమించారు. తాత్కాలికంగా అయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.  అయనకు ఏ పోస్టింగ్ ఇవ్వలేదు.  సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి.

Related Posts