YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

విజయవాడ
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో ప్లాట్లను అభివృద్ధి పరిచి అప్పగించాలని; రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసిందని అయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, అభివృద్ధి చేయాలి. రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలని అయన అన్నారు.

Related Posts