YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

బీటెక్ ను మించిన ఎల్ కేజీ ఫీజులు

బీటెక్ ను మించిన ఎల్ కేజీ ఫీజులు

హైదరాబాద్, ఏప్రిల్ 23,
రాష్ట్రంలోని  ప్రైవేటు స్కూళ్ల ఫీజులకు అడ్డూ అదుపు లేకుండాపోతున్నది. నర్సరీ, ఎల్కేజీ చదువులకే లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. కొన్ని కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలోనైతే  ప్రైమరీ క్లాసులకే రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ ఫీజు ఉంది. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా, స్కూళ్ల వెబ్సైట్లలో స్పష్టంగా కనిపిస్తున్నా రాష్ట్ర సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. అడిగేవారు లేకపోవడంతో మేనేజ్మెంట్లు ప్రైమరీ క్లాసులకే ఇంజినీరింగ్ను మించి ఫీజులు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో సుమారు 11 వేల ప్రైవేటు స్కూల్స్ఉండగా, వాటిలో 30 లక్షలకు పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లు మినహా, మెట్రో నగరాల్లోని పలు స్కూళ్లలో ఫీజులు దారుణంగా ఉన్నాయి.
అడ్మిషన్, స్పెషల్ ఫీజులను కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్లు  ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. దాదాపు మెజార్టీ ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఏటా10 నుంచి 30 శాతం ఫీజులు పెంచుతున్నాయి.
ఫీజుల విషయంలో సరైన రూల్స్ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొన్ని స్కూళ్లు మెయిన్ ఫీజులను తక్కువగా తీసుకొని, డెవలప్మెంట్ ఫండ్  పేరుతో అందినంత దండుకుంటున్నాయి. డెవలప్మెంట్ ఫండ్కు రశీదులంటూ  ఏమీ ఇవ్వడం లేదు. జీవో నెంబర్ 1 ప్రకారం ఐదు శాతం లాభం ఉండేలా ఫీజులను తీసుకోవాలి. కానీ ఈ రూల్ ఏ స్కూల్లోనూ అమలు కావడం లేదు. ఫీజుల డీటెయిల్స్ బోర్డుల మీద పెట్టాలనే నిబంధనలను స్కూళ్లు పట్టించుకోవడం లేదు.   చిన్నపిల్లలు తినే వస్తువులు సహా వేటినీ విద్యా సంస్థల్లో అమ్మొద్దని ఆదేశాలున్నాయి. కానీ, చాలా స్కూళ్లు తమ కాంపౌండ్లోనే అమ్ముతూ పెద్దవ్యాపారమే కొనసాగిస్తున్నాయి. పుస్తకాలు, యూనిఫామ్, నోట్ బుక్స్, స్టేషనరీ, షూస్,  స్పోర్ట్స్ మెటీరియల్.. ఇలా అన్నీ బడుల్లో కొనాల్సిందేనని పేరెంట్స్కు తెగేసి చెప్తున్నాయి. వీటిని మార్కెట్ రేట్ల కంటే 30% నుంచి 80% వరకూ పెంచి అమ్ముతున్నాయి. చాలా స్కూళ్లు టెక్ట్స్ బుక్స్పై  తమ స్కూళ్ల పేర్లు రాసి అమ్ముతున్నాయి. మరోపక్క సర్కారు ఆదేశాల ప్రకారం స్కూళ్లకు కేవలం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ అని మాత్రమే రాయాలి. కానీ చాలా స్కూళ్లు.. టెక్నో, మోడల్, ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలంపియాడ్ వంటి పేర్లను యాడ్ చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల కంట్రోల్ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో సర్కారు ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం పక్కన పెట్టింది.  జనవరిలో జరిగిన కేబినెట్  భేటీలో మాత్రం.. ఫీజుల కట్టడికి చట్టం తెస్తామని, చట్టం ఎలా ఉండాలనే దానికోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని  ఏర్పాటు చేస్తున్నామని  సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ కమిటీ మార్చి ఫస్ట్ వీక్లో భేటీ అయి, పలు ప్రతిపాదనలను సర్కారుకు ఇచ్చింది. ఇప్పటికీ ఫీజుల నియంత్రణపై సర్కారు నిర్ణయం తీసుకోలేదు.
2021–22 అకడమిక్ ఇయర్ అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ముగియనుంది జూన్ రెండోవారంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ 2022–23 అకడమిక్ ఇయర్ను చాలా కార్పొరేట్, ఇంటర్నేషన్ స్కూళ్లు అనధికారికంగా ఎప్పుడో స్టార్ట్  చేశాయి. కొన్ని స్కూళ్లు అడ్మిషన్లు పూర్తిచేసి ఫస్ట్  టర్మ్ ఫీజునూ వసూలు చేశాయి.

Related Posts