YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బెంగళూరుకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్

బెంగళూరుకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్

లంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరు బయల్దేరారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం  ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ కుమారస్వామిని అభినందించేందుకు సీఎం బెంగళూరు బయలు దేరి వెళ్లారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బెంగళూరుకు వెళ్లారు.  రేపటి ప్రమాణ స్వీకారానికే హాజరు కావాలని తొలుత భావించినప్పటికీ.. ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బుధవారం అత్యవసర సమావేశాలు ఉన్నందున సీఎం కేసీఆర్ ఈ రాత్రికే హైదరాబాద్ తిరిగి చేరుకోనున్నారు. బెంగళూరు పర్యటనలో సీఎం వెంట డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, సభాపతి మధుసూదనాచారి, మంతు్రలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు వినోద్‌, కేకే, సంతోష్‌ ఉన్నారు. బిజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతుండటంతో... కేసీఆర్ వెళ్తారా? లేదా? అనే సంశయం నెలకొంది. ఇప్పుడు సందిగ్ధత వీడింది.

Related Posts