YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సలహదారులను తొలగించండి

సలహదారులను తొలగించండి

అమరావతి
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో 45 మంది సలహాదారులున్నారు.  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక సలహాదారులను నియమించారు.  ఈ నియామకం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే.  కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రయోజనం పొందే ఎవరైనా ఎన్నికల కోడ్, సేవా నిబంధనలకు కట్టుబడి ఉండాలి.  చాలా మంది సలహాదారులు రాజకీయ పాత్ర పోషిస్తున్నారు.  రాజకీయ చర్చలో మునిగిపోతున్నారు. రాజీనామా తర్వాతే సలహాదారులు రాజకీయ ప్రసంగం చేయొచ్చు. కొంతమంది సలహాదారులు ప్రభుత్వ సదుపాయాలు పొందుతూ వైసీపీ ఆఫీసుల ఆవరణలోనే రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు.  ఇది అనాలోచితం,  ఈ లోపాన్ని ఏపీ సీఈవో దృష్టికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీసుకెళ్లింది.  ఇది ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ సలహాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోకు విజ్ఞప్తి చేసామని అన్నారు

Related Posts