మేడ్చల్
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడ్చల్ నుంచి తూప్రాన్ దారి లో రేకుల బాబి వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ ఓ టీ పోలీసులు కాపుకాచి, గంజాయిని పట్టుకున్నా రు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గిరి దారి (38), సికింద్రాబాద్ ప్రాంతంలోని తిరుమలగిరి కి చెందిన నల్ల రోహిత్ కుమార్ (24) గంజాయిని తరలిస్తుండగా ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు కిలోల ఎండు గంజాయి, ఒక మొబైల్, తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మేడ్చల్ పోలీస్ లకు అప్పగించారు.