YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇళ్ల పేరిట కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలు

ఇళ్ల  పేరిట కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలు

సంగారెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని గద్దెనెక్కిందని, బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తామని పదేళ్లు కాలయాపన చేసి అమాయక ప్రజలను మోసం చేశాయని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు. కార్మిక లోకానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారం లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొల్లారం లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పదేళ్లు మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజూ బొల్లారం వైపు చూడలేదని, ఇప్పుడేమో వంద కోట్లతో ఏమోమో చేస్తానని ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. ఎక్కడ భూములు కబ్జాలు చేయాలో, ఎక్కడ అక్రమంగా ప్లాట్లు వేయాలో విషయాల్లో ఆరితేరిన వ్యక్తికి రేవంత్ రెడ్డి మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారన్నారు. కార్మికుల పక్షాన నిలబడే పార్టీ బీజేపీయేనని, అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉండే బొల్లారంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని రఘునందన్ రావు అభ్యర్థించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు కేజీ ఆనంద్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

Related Posts