YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రచారం లో ముందంజలో టీడీపీ

ప్రచారం లో ముందంజలో టీడీపీ

శ్రీశైలం
శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలం మండలంలో సూపర్ సిక్షర్ మాదిరిగా టిడిపి ప్రజల్లోకి దూసుకుపోతుంది గత మూడు రోజులుగా శ్రీశైలం మండలంలో వందలాది మంది వైసిపి పార్టీని వీడి టీడిపికి వలసల పర్వం కొనసాగుతుంది. శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. శ్రీశైలం మండలం సున్నిపెంటలోని వైసిపి ముఖ్య నేతలు తమ కార్యకర్తలతో భారీ ర్యాలీలు నిర్వహించి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. సున్నిపెంటలోని వైసిపి  సీనియర్ నాయకుడు తనయుడు ఆసాది ప్రవీణ్ తేజ ఆద్వర్యంలో సుమారు వంద కుటుంబాలు టీడిపిలో చేరారు రాత్రి పది గంటల వరకు పార్టీలోకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి పార్టీ కండువాలు ఆహ్వానం పలుకుతూనే ఉన్నారు.ఒక్కరోజే శ్రీశైలం మండలం సున్నిపెంటలో సుమారు నాలుగు వందలమంది వైసిపి కార్యకర్తలు ఆ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలొ చేరడం ప్రభంజనంలా పసుపు జండాలతో కొత్త రూపం దాల్చుకుంది శ్రీశైలం నియోజకవర్గంలో అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి స్దానికులకు హామి ఇచ్చారు.శ్రీశైలం మండలాన్ని పూర్తి స్దాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పడంతో ప్రజలు కేరింతలతో హోరెత్తించారు గత మూడు రోజులుగా శ్రీశైలం మండలంలో వైసిపి నుంచి టిడిపిలోకి వలసల పర్వం కొనసాగుతుంది.

Related Posts