YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎందుకు బీజేపీకి ఓటేయ్యాలి కేటీఆర్

ఎందుకు బీజేపీకి ఓటేయ్యాలి కేటీఆర్

రంగారెడ్డి
చేవెళ్ల లోక్ సభ పరిధిలోని రాజేంద్ర నగర్ లో జరిగిన రోడ్ షో లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోని ప్రసంగించారు.
కేటీఆర్ మాట్లాడుతూ మోడీకి, ఎన్డీఏ కూటమికి 400 కాదు..200 ల సీట్లు కూడా వచ్చేలా లేవు.  కాంగ్రెస్ పార్టీ కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్ఎస్ కు మంచి సీట్లు రావాలె.  బీఆర్ఎస్ కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే మనం చెప్పినట్లే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వింటది.  తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి బుద్ధి చెప్పాలని అన్నారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలె.  బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బహుబలి కాసాని జ్ఞానేశ్వర్. బలహీనవర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉంది. అది తప్పని నిరూపించాలె.  చెేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి సారిగా బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు.  అందరం కలిసి కాసాని అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.  అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలే.  రైతుల దగ్గరకు వెళ్లి రూ. 2 లక్షల హామీ నెరవేరిందా అడగాలె.   మీరంతా బహుబలి సినిమా చూశారా? అందులో రెండు పార్ట్ లు ఉన్నట్లే.  రేవంత్ రెడ్డి మోసం పార్ట్-1 అయిపోతుంది. మోసం పార్ట్-2 సీక్వెల్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి.  ఒకసారి మోసపోయింది చాలాదా? ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు. రెండో సారి మోసం పోతే నమ్మిన వాళ్లది తప్పని అన్నారు.
కేసీఆర్ అభివృద్ధి చేసిన పదేళ్ల పాలన ఒకవైపు...100 రోజుల అబద్దాల పాలన ఒక వైపు.  రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, రైతుబీమా, కేసీఆర్ కిట్ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎంతో మంచి చేసిండు.  చేవెళ్లలో బ్రహ్మండమైన  అభివృద్ధి చేసుకున్నాం. వికారాబాద్ ను జిల్లా చేసుకున్నాం.  111 జీవోను కూడా ఎత్తివేసింది కేసీఆర్ మాత్రమే అన్నది గుర్తు చేసుకోవాలె.  బీజేపీ పదేళ్లలో ఏమీ చేశారో చెప్పి ఓటు అడుగుమంటే చెప్పేందుకు ఒక్కటి లేదు. మోడీ తెలంగాణకు ఒక్క కాలేజ్ పెట్టినవా, స్కూల్ ఇచ్చినవా, జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినవా? ఏమీ ఇచ్చినవ్.  రాముడితోని మనకు పంచాయితీ లేదు. రాముడు అందరివాడు.  మతం పేరుతో విద్వేషాలు నింపి ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలె.  ఆడబిడ్డలు ఆలోచించాలె. మోడీ సిలిండర్ ధరను ఎంత పెంచిండో గుర్తు చేసుకోవాలె.  క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్, డిజీల్ ధరలు పెంచిన్రు.  70 రూపాయల పెట్రోల్ ను 110 చేసినందుకా? డిజీల్ రేట్లు పెంచినందుకా? సిలిండర్ రేట్లు పెంచినందుకా? పప్పు, ఉప్పులు ఫిరం చేసినందుకా? ధరలు పెంచినందుకా ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి? బండి సంజయ్ మాత్రం మోడీ దేవుడు అంటాడు. ఆయన దేనికి దేవుడో చెప్పుమంటే చెప్పడు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే బీజేపీకి కచ్చితంగా మన బుద్ధి చెప్పాలె.  ఈ ప్రాంతానికి బీజేపీ ఏం చేసిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటు అడుగుతాడు.  కృష్ణానీళ్లలో వాటా తేల్చుమంటే పదేళ్లుగా దాన్ని తేల్చలేదు.  పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వని పార్టీ అంటే బీజేపీయే. బీజేపీని అడ్డుకునేది ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని అన్నారు.

Related Posts