
హైదరాబాద్
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం పై దాడికి దిగీఆరు. ప్రియాంక గాంధీ పైన బిజెపి ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమం చేపత్టారు. ఒకవైపు రాళ్లు మరోవైపు కర్రలతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాళ్లు విసరడం తో ఓ బిజెపి కార్యకర్తకు తలకు గాయం అయింది. ప్రియాంక గాంధీ పై చేసిన అనిచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే లేదంటూ హెచ్చరించారు.
మరోవైపు ఇది ప్రజాస్వామ్యంలో సరైనది కాదని బీజేపీ విమర్శలు చేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోలీసులతో కుమ్మక్కై బీజేపీ కార్యాలయం పై దాడికి చేసిందని విమర్శలు చేసింది. సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రజల మన్నలను పొందాల్సిద్ధి పోయి బిజెపి కార్యాలయం పై దాడి చేయడం సరైనది కాదని పార్టీ నేత ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. పోలీసులు, కాంగ్రెస్ కుమ్మక్కై బీజేపీ కార్యాలయం పైన దాడి చేశారని, మేము తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరించారు.