YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సందడిగా ఉప్పల్ రింగ్ రోడ్డు

సందడిగా ఉప్పల్ రింగ్ రోడ్డు

మేడ్చల్
సంక్రాంతి పండగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్డు సందడిగా మారింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఉప్పల్ పాయింట్ నుండి  1200 బస్సులను ఏర్పాటు చేశామని వరంగల్ రిజన్ ఆర్టీసీ అధికారి తెలిపారు. శనివారం సెలవు దినం కావడంతో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది అని అన్నారు. శుక్రవారం ఒక్కరోజే 400 బస్సుల వరకు ఏర్పాటు చేశామని, ఈరోజు సుమారు 500  వరకు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం 200 ల బస్సుల వరకు వెళ్లాయి. దాంట్లో 74 స్పెషల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Related Posts