YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెంకన్న సన్నిధీలో రమణాచారి

వెంకన్న సన్నిధీలో రమణాచారి
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని మాజీ ఈవో కేవీ రమణ చారి దర్శించుకున్నారు. బుధవారం  ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారి అనుగ్రహం లేకుండా ఎలాంటి సంఘటనలు జరగవన్నారు. ఇటీవలి కాలంలో వివాదాలు వచ్చాయి అంటే అదికూడా ఆ స్వామి సృష్టించినట్లే అని భావిస్తున్నానని ఆయన అన్నారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలుగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీటీడీ మాజీ ఈఓ రమణ చారి అన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Related Posts