
తిరుపతి, ఏప్రిల్ 26,
ఏపీలో కూటమి సర్కార్ దూకుడు పెంచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, నేరాలు-ఘోరాలను వెలికితీసేందుకు యాక్షన్ ప్లాన్ ను స్పీడప్ చేసిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. దీంతో కూటమి సర్కార్ కొలువైన దగ్గరి నుంచే వైసీపీ అవినీతి గుట్టలను బద్దలు కొడుతూ ఒక్కో రాయిని పెకిలించి వేస్తోంది. అలా ఇప్పటివరకు అనేక కేసుల్లో ఇరుక్కుకున్న విపక్షానికి చెందిన నేతలను అరెస్ట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు. ఏపీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం ఇంకా కంటిన్యూగా కొనసాగుతోంది. పిన్నెల్లితో పాటు నందిగం సురేష్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంటి వారు అరెస్ట్ అయ్యారు. ఇందులో కొందరు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. మరికొందరు మాజీలు అరెస్టు భయంతో కోర్టుల చుటూ తిరుగుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి విడదల రజినిపై ఉన్న కేసులో ఆమె మరిది గోపిని అరెస్టు చేశారు. అలాగే మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులును నటి జత్వాని కేసులో అరెస్టు చేసి రిమాండ్ కి పంపారు పోలీసులు.ఇక లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే కీలక సూత్రధారి అయిన కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఈ కేసులో 8వ నిందితుడిగా ఉనన కేసిరెడ్డి తోడల్లుడు బూనేటి చాణక్యని కూడా అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. వసూళ్లు చేసిన కమీషన్ల మొత్తాన్ని చాణక్య…రాజ్ కసిరెడ్డికి అందించేవారని..అక్కడి నుంచి ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ సాయిరెడ్డి, భారతి సిమెంట్స్ లో పనిచేసే బాలాజీ, అలాగే వైఎస్ అనిల్ రెడ్డికు చేరేవని సిట్ విచారణలో తేలిందట. వీరి ద్వారా వివిధ రూపాల్లో కమీషన్లు.. అంతిమంగా అప్పటి సీఎం జగన్కు చేరేవని సిట్ విచారణలో తేలిందని సమాచారం.అయితే బూనేటి చాణక్య రిమాండ్ రిపోర్టులో అనేక సంచలన అంశాలు పొందుపరిచారట సిట్ అధికారులు. దాని ప్రకారం..వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 తొలినాళ్లలో హైదరాబాద్లోని ఓ హోటల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగిందట. మద్యం కుంభకోణానికి అక్కడే బీజం పడిందట. ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని గురువారంనాడు సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.కేసులో 3నెలల క్రితం సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను అరెస్టు చేశారు. మరో నిందితుడైన అప్పటి ఆర్డీవో మురళి ఏసీబీ అదుపులో ఉన్నారు. పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి పట్టుబడడంతో త్వరలో మరిన్ని పెద్దతలకాయలను సీఐడీ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని టాక్. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు, ఎంపీ మిథున్రెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డిని అదుపులోకి తీసుకోవచ్చన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజిని, కాకాణి గోవర్ధన్ రెడ్డిలపై కేసులు నమోదు అవ్వడంతో త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అలాగే లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే ఈ అరెస్ట్లతో కూటమి సర్కార్ రాజకీయాలకు..ఓ రకమైన సందేశం ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒకప్పుడు నేతల మధ్య మాటల యుద్ధం అంటే రాజకీయంగా ఉండేది.
కొంతకాలంగా రాజకీయమే యుద్ధంగా మారుతోందట. వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ..వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు కొందరు నేతలు. ఇక వాళ్లు వాడే భాష జుగుప్సాకరం, అసభ్యకరం, అభ్యంతకరంగా ఉందన్నది మరికొందరి అభిప్రాయం. దీంతో సింపథీ వర్కౌట్ కాకపోగా..ఒకరకమైన చర్చ జనాల్లో మొదలవుతోంది. దీంతో ఇలాంటి ఇక చెల్లవ్ అని పరోక్షంగా చెప్పేందుకే..వరుస అరెస్ట్లు జరుగుతున్నాయా అనేది మరికొందరి వాదన.మొత్తానికి ఏపీలోని ప్రతిపక్ష నేతలకు అరెస్టుల భయం పట్టుకుందట. ఏ రోజు.. ఏ క్షణంలో తమ చేతులకు పోలీస్ సంకెళ్లు పడతాయోనని తెగ టెన్షన్ పడుతున్నారట. తాజాగా అరెస్టుల పర్వం మరోసారి స్పీడప్ కావడంతో విపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. అయితే తొలుత చిన్న లీడర్లను అరెస్ట్ చేస్తున్న పోలీసులు…వారిచ్చే కీలక సమాచారంతో బిగ్ లీడర్స్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారట. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల కేసుల్లో రాబోయే రోజుల్లో బిగ్ షాట్స్ అరెస్ట్ తప్పదనే చర్చ నడుస్తోంది. దీంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? నెక్ట్స్ అరెస్ట్ ఎవరిదంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చ నడుస్తోందట.