
ఆసిఫాబాద్
తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీ అందించేందుకు, జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అమేయ కృషి చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసించారు. రూ.3,900 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టుల ప్రారంభ సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మారిన ఆయనకు ప్రభుత్వం తరఫున పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణకు అవసరమైన మరో రోడ్ కనెక్టివిటీ కోసం ఆయనకు అభ్యర్థన. తెలంగాణకు హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ వరకు అలాగే నాందేడ్, పుణె, నాసిక్ మీదుగా మహారాష్ట్రకు రోడ్ కనెక్టివిటీ అందించాలని కేంద్ర మంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.