
ఏలూరు, జూన్ 20,
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చాపకింద నీరులా పనిచేసుకుపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన తన నాయకత్వాన్ని మరింతత పటిష్టం చేసుకునే దిశగా అడుగులువేస్తున్నట్లు కనపడుతుంది. వివాదాలకూ దూరంగా ఉంటున్నారంటే చింతమనేనిప్రభాకర్ కు పార్టీ పెద్దల నుంచి ఏదో సూన లాంటిది వచ్చినట్లే కనపడుతుంది. అందుకే చింతమనేని ప్రభాకర్ గత ఏడాది కాలంగా కాంట్రవర్సీ జోలికి వెళ్లకుండా తన పనులను మాత్రం నెరవేర్చుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశంపార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్. గతంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే వారు. ఆయన వివాదంలో లేకపోతేనే నాడు వార్త అయ్యేది. కానీ నేడు ఏడాది నుంచి తన పనేదో తానుచేసుకుపోతున్నారంటే ఏదో ఉందన్నది పార్టీలోనూ, దెందులూరు నియోజవర్గం టీడీపీ క్యాడర్ లో జరుగుతున్న చర్చ. తెలుగదేశంపార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా చింతమనేని ప్రభాకర్ స్టయిల్ వేరుగా ఉంటుంది. వివాదాలే రాజకీయంగా ఆయన ఎదుగుదలకు అడ్డంకిగా మారాయన్నది వాస్తవం. పార్టీ అంటే పడిచచ్చిపోయే నేత కావడంతో చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ నాయకత్వం దూరం పెట్టదు.చింతమనేని ప్రభాకర్ సీనియర్ రాజకీయ నాయకుడు. 2019 ఎన్నికల్లో చింతమనే ప్రభాకర్ దెందులూరు నుంచి ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ సానుభూతితో పాటు కూటమి హవా కూడా తోడవ్వడంతో 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని ప్రభాకర్ పూర్తిగా సాధుజీవిగా మారారు. గతంలో అధికరారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు చింతమనేనిని ఇలా చూడలేదన్నది పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్న మాట. సన్నిహితుల సూచనలతో... 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పటి ఎమ్మార్వో వనజాక్షిని బెదిరించిన వైనం చింతమనేని ప్రభాకర్ ను రాజకీయంగా ఇబ్బందులపాలు చేసింది. అంతేకాదు పార్టీ ప్రతిష్టను కూడా దిగజార్చింది. తర్వాత కూడా ఆయన తగ్గలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. తాను నిత్యం నిత్యం ప్రజల్లో ఉంటూ, సమస్యలను పరిష్కరిస్తున్నా ఎందుకు ఓటమి చెందానన్నది తనకే అర్థంకావడం లేదన్నది చింతమనేని ప్రభాకర్ సన్నిహితులవద్ద వ్యాఖ్యానిస్తుంటారట. అయితే వివాదాల వల్లనే ఆయనను జనం 2019 ఎన్నికల్లో దూరం పెట్టారని సన్నిహితులు చెప్పడంతో ఇప్పుడు ఆయన పెద్దగా కనిపించడం లేదు. అలాగనిపార్టీలోనూ, నియోజకవర్గంలోనూయాక్టివ్ గా లేడని కాదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ మంచిపేరు తెచ్చుకునే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. Also .. 2014 లో పార్టీ గెలిచినప్పుడు చింతమనేని ప్రభాకర్ కు మంత్రి పదవి దక్కకపోవడానికి వివాదాలే కారణమని అంటున్నారుర. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ నేతగా ఉన్న ప్పటికీ ఆయనకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా పదవులు దక్కలేదు. 2009, 2014లో వరసగా దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని ప్రభాకర్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా పార్టీ కోసం జెండా వదలలేదు. కార్యకర్తలకు అండగా నిలబడటంలో ముందున్నారు. అనేక కేసులు తనపై నమోదవుతున్నా చింతమనేని ప్రభాకర్ బెదరలేదు. భయపడలేదు. పదవి రావాలంటే కొన్నాళ్ల పాటు కాంట్రవర్సీకి దూరంగా ఉండాలని అధినాయకత్వం చెప్పిన మాటలను ఆయన పాటిస్తున్నారట. తన ప్రత్యర్థి అబ్బయ్య చౌదరిపై కేసులు బనాయించి విదేశాలకు వెళ్లేలా చేసి నియోజకవర్గంపై తన పట్టును మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.