YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లిక్కర్ లీడర్ల వంతు....

లిక్కర్ లీడర్ల వంతు....

తిరుపతి, జూన్ 20, 
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎప్పుడు ఏంజరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ ఈ కేసులో తొమ్మిది మంది అరెస్టయ్యారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఇక వరసగా రాజకీయ నేతలు అరెస్ట్అవుతారన్న ప్రచారం జరుగుతుంది. 2019 నుంచి 2024 మధ్య మద్యంవిక్రయాల్లో పెద్దయెత్తున కుంభకోణం జరిగిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. కొన్ని నెలల నుంచి దీనిపై సుదీర్ఘంగా దర్యాప్తు చేస్తున్న సిట్అధికారులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన క్లూ ఆధారంగా రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి కీలక నిందితుడని పేర్కొన్నారు. ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్టయ్యారు. ఆయనతో పాటు చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్ నాయుడును కూడా అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి పేరు బాగా ప్రచారంలో ఉంది. మిధున్ రెడ్డి ఇప్పటికే తనను అరెస్ట్ చేయవద్దంటూ ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్నిఆశ్రయించారు. అదే సమయంలో ఈ కేసులో బిగ్ బాస్ పేరు కూడా ప్రముఖంగా వినిపస్తుంది. దీంతో చెవిరెడ్డి తర్వాత ఎవరు అరెస్టవుతారన్న దానిపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  లిక్కర్ స్కామ్ కేసులో 37, 38 నెంబరు నిందితులుగా ఉన్నవారిని అరెస్ట్ చేయడంతో ఇక తర్వాత ఎవరన్నది హాట్ టాపిక్ గా మారింది. కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించారని ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. రిమాండ్ లో ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డిలను విచారించారు. మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. అయితే చెవిరెడ్డి అరెస్ట్ తో రాజకీయ నేతల అరెస్ట్ ల పర్వం ప్రారంభమయినట్లే కనిపిస్తుంది. ఇక దీంతో తర్వాత మిధున్ రెడ్డి ని అదుపులోకి తీసుకుంటారా? లేక అంతకంటే అత్యున్నత స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? అని వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలయింది.

Related Posts