YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ ఆలయాలకు కూడా కల్తీ నెయ్యే సరఫరా

ఆ ఆలయాలకు కూడా కల్తీ నెయ్యే సరఫరా

తిరుపతి.
తిరుమలలోని లడ్డూ ప్రసాద తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేస్తోన్న విచారణలో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రముఖ దేవాలయాలకూ కల్తీ విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధరణకు వచ్చారు. తిరుపతిలో డెయిరీకి కమీషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతోనే కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు విచారణలో తేల్చారు.

Related Posts