
సికింద్రాబాద్
తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ జూబ్లీ గేటు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఫోటోలు వీడియోలు తీసుకున్న నలుగురు వ్యక్తులను (ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు) తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేసారు. రాకేష్ కుమార్, ఆశిష్ కుమార్, ఆలియా అబ్షీ, నగ్మభానూ ఎంసిఈఎంఈ టెక్నో చౌక్ గేటు లోకి ప్రవేశించారు. నకిలీ గుర్తింపు కార్డులు వేసుకొని వైమానిక దళ అధికారి అని నమ్మించి ఎలాంటి అనుమతి లేకుండా ఆర్మీ రహస్య ప్రాంతాల ఫోటోలు వీడియోలు చిత్రీకరిస్తుండగా వారిని సెంట్రీలు ప్రశ్నించారు. మిలిటరీ రహస్య ప్రాంతాల విషయాలపై కీలక సమాచారాలు, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం పట్ల పలు అనుమానాలు రేగాయి. సెంట్రీలు పై అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ఎయిర్ ఫోర్స్ ఇంటలిజెన్స్, సదరన్ కమాండర్ బెటాలియన్ ఇంటెలిజెన్స్, టాసా ప్రతినిధులు విచారంచారు. లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో తిరుమలగిరిలో కేసు నమోదు చేసారు.