YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ హమీలపై సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత సవాల్

కాంగ్రెస్ హమీలపై సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత సవాల్

హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దాం. రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదు. రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైందని ఆరోపించారు.
గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదు. యస్.. అసెంబ్లీ పెడుదాం... ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దాం. కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని అన్నారు.
మహిళలకు 2500, పెన్షన్ల మొత్తాన్ని పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమం చేసారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించారు. అబిడ్స్ జీపీవోలో పోస్ట్ కార్డులను ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పోస్ట్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ 2 వేల పెన్షన్ ను రూ 4 వేలు చేస్తామన్న హామీని విస్మరించిన కాంగ్రెస్. వికలాంగుల పెన్షన్ ను రూ 4 వేల నుంచి రూ 6 వేల కు పెంచకుండా మోసం చేసిన కాంగ్రెస్. మహిళలకు నెలకు రూ 2500 ఇస్తామన్న హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. గ్యారెంటీలపై సోనియా గాంధీ సంకతం పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారు. సోనియాగాంధీ ముఖం చూసి ఓట్లేసిన  మహిళలను, వృద్ధులను, వికలాంగులు మోసం చేశారు. అందుకే సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించాము. పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని సోనియా గాంధీని కోరామని అన్నారు.

Related Posts