
రాజమండ్రి
రాజమండ్రి లో జరిగిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గోన్నారు.
మంత్రి మాట్లాడుతూ తూర్పు పర్యాటకానికి సింహ ద్వారం గా ఉన్న రాజమహేంద్రవరం చారిత్రాత్మక వైభవాన్ని, ప్రపంచ వ్యాప్తం చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్ట్ తీసుకురావడం శుభపరిణామమని అన్నారు.
2014 లో రాష్ట్ర విభజన కంటే, 2019-24 మధ్య 5 ఏళ్ళ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించే దిశ లో కూటమి ప్రభుత్వం టూరిజానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఉత్తరాంద్ర విశాఖ అందాల తీరం నుండి, రాయలసీమ లోని గండికోట, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యాటక అందాలను, టెంపుల్ టూరిజాన్ని కలుపుతూ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం. టూరిజాన్ని అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లోకి తీసుకెళ్లేలా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల కష్టానికి, ప్రధాని నరేంద్ర మోదీ సహకారానికి కృతజ్ఞతలని అన్నారు.