
విజయవాడ జూలై 22,
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రయాణికుల సౌకర్యం, డిమాండ్ నేపథ్యంలో విజయవాడ - లింగంపల్లి- విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ రైళ్లకు శాశ్వత ప్రాతిపదికన అదనపు బోగీలు అమర్చనున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపింది. విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ఒక 3AC ఎకానమీ కోచ్.. అలాగే లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు మరో 3AC ఎకానమీ కోచ్ ఏర్పాటు చేయనున్నారు. జూలై 26, 27 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.రైలు ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు ఈ విషయాన్ని విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యం కోసం, అలాగే ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను అనుసరించి రైలు నంబర్ 12795/96 విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు శాశ్వతంగా అదనపు కోచ్లు పెంచినట్లు విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయం వెల్లడించింది. అదనపు బోగీలు ఏర్పాటు ద్వారా మరిన్ని సీట్లు, సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణానికి వీలు కలుగుతుందని తెలిపింది.12795 నంబర్ విజయవాడ - లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ఒక 3AC ఎకానమి కోచ్ అమర్చనున్నారు.12796 నంబర్ లింగంపల్లి - విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ఒక 3ఏసీ ఎకానమీ కోచ్ అమర్చనున్నారు. జూలై 26, జూలై 27వ తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయం వెల్లడించింది. మరోవైపు విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు.. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జంక్షన్ రైల్వేస్టేషన్ నుంచి తెలంగాణలోని లింగంపల్లి మధ్య ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. 2018లో వీటిని ప్రవేశపెట్టారు. ఏపీ రాజధాని ప్రాంతం.. హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రైళ్లు సౌకర్యంగా ఉంటాయి.విజయవాడ - లింగంపల్లి- విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు 336 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 5 గంటల 55 నిమిషాలలో చేరుకుంటాయి. లింగంపల్లి నుంచి ప్రతిరోజూ ఉదయం 4 గంటల 40 నిమిషాలకు లింగంపల్లి -విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (12796) రెలు బయల్దేరుతుంది. ఉదయం 10 గంటల 35 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. థర్డ్ ఎకానమీ (3E), చైర్ కార్ (CC), సెకండ్ సీటర్ (2S) కోచ్లు అందుబాటులో ఉన్నాయి. బేగంపేట్ , సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, గుంటూరు జంక్షన్, మంగళగిరిలో ఈ రైలుకు స్టాపింగ్ ఉంది.