
హైదరాబాద్
మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుపై మండిపడ్డారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు మరోసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు . బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ 9 వ షెడ్యూల్ లో చేర్చడం అసాధ్యం అంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమే. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడు లో జరిగింది. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎంపీలు రాజీనామా చేయాలి ..ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తాం..లేదా దీనిని సాధించిపెట్టింది. సుప్రీంకోర్టు లో ఇందిరా సహనీ కేసులో స్పష్టంగా చెప్పారని అన్నారు.
రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం ఉంటే ఎంపెరికల్ డేటా ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి కేబినెట్ ఆమోదం శాసన సభ ఆమోదం , గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది బరబర్ రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేస్తాం. అనాడు మండల్ కమిషన్ తీసుకొస్తే కమండల్ అన్నది మీరే. మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని బీసీ ల పట్ల కుట్రను బయటపెట్టారు. తెలంగాణ లోని అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజస్వరూపాన్ని గమనించి రినర్వేషన్లు ప్రక్రియను కాపాడుకునే దానిలో ముందుండాలని కోరుతున్న. బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా 9 వ షెడ్యూల్ లో చేర్చాల్సిందే . గతంలో జనహిత అభియాన్ కేసులో ఈడ్బ్లుఎస్ సందర్భంగా స్పష్టంగా చెప్పింది. ప్రామాణిక నివేదిక ప్రకారం సమాచారం సుప్రీంకోర్టు లో ఉంది. మభ్యపెడుతుంది మీరు.. ముఖ్యమంత్రి బీసీ అన్నది మీరు సిఎల్పీ నాయకుడు బీసీ ఇవ్వంది మీరు పార్టీ అధ్యక్షు పదవి కూడా బీసీ లకు ఇవ్వని మీరు.. మండల వ్యతిరేకించిన మీరు బీసీ లకు వ్యతిరేకంగా ఫ్యూడల్ పార్టీ లో ఉన్నారని అన్నారు.
సామాజిక న్యాయంతో కాంగ్రెస్ తోనే సాధ్యం..సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే ఎస్సీ ఉప ముఖ్యమంత్రి మా పీసీసీ అధ్యక్షుడు బీసీ ఉన్నారు. మా వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరిస్తున్నానని అన్నారు.