హైదరాబాద్ అసిఫ్ నగర్ చౌరస్తా వద్ద ఓ పక్క సమాచారం మేరకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అదివారం సాయంత్రం అధికారులకు పక్క సమాచారం అందింది. ఈ మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అసిఫ్ నగర్ వద్ద డ్రగ్స్ సరఫరా చేస్తున్న షేక్ బషీర్ అహ్మెద్, అహ్మద్ ఖాన్ లను పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రెండు లక్షల విలువైన పది గ్రాముల ఎండీఎంఏ, పదహారు గ్రాముల చరస్, ఎనిమిది గ్రాముల కోకైన్ తో పాటు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యువత ను టార్గెట్ చేసి అమ్ముతున్నారు. గతం లో వీళ్ళ పైనా ఎటువంటి నేర చరిత్ర లేదని స్టేట్ టాస్క్ ఫోర్స్ అసిస్టంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్ కుమార్ అన్నారు.