YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఉగ్రవాదులు కూడా అమరులే.. అధికారపార్టీ ఎమ్మెల్యే కలకలం..

ఉగ్రవాదులు కూడా అమరులే.. అధికారపార్టీ ఎమ్మెల్యే కలకలం..

జమ్మూ కశ్మీర్‌లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదులను కీర్తిస్తూ అధికార పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే ఒకరు కొత్త వివాదం రేపారు. ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడే వాచీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ పిర్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్‌లోని ఉగ్రవాదులు కూడా అమరవీరులే. వారు మన సోదరులు.. తాము ఏమి చేస్తున్నారో కూడా తెలియని మైనర్లు కూడా అందులో ఉన్నారు. టెర్రరిస్టులు చనిపోయినప్పుడు మనం వేడుకలు జరుపుకోకూడదు. ఇది మనందరి వైఫల్యం..’’ అని చెప్పుకొచ్చారు.తీవ్రవాదులపై పోరాడుతూ జవాన్లు చనిపోవడం కూడా బాధాకరమైన విషయమంటూ ఆయన పేర్కొన్నారు. ‘‘మన భద్రతా సిబ్బంది చనిపోతుండడం కూడా బాధ కలిగిస్తోంది. సైనికుల తల్లిదండ్రులపై సానుభూతి చూపినట్టుగానే, తీవ్రవాదుల తల్లిదండ్రులకు కూడా సానుభూతి తెలిపాలి...’’ అని పేర్కొన్నారు. కశ్మీర్ వివాదంపై చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి దినేశ్వర్ శర్మ... వేర్పాటువాద హురియత్ పార్టీ, ఉగ్రవాదులు సహా కశ్మీరీలందరితో చర్చలు జరపాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.కాగా ఐజాజ్ వ్యాఖ్యలపై మిత్రపక్షం బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘తీవ్రవాదులు, వేర్పాటు వాదులు.. కశ్మీర్‌కు, కశ్మీరీలకు, అభివృద్ధికి, శాంతికి విరోధులు. వాళ్లు ఎలా మరొకరికి సోదరులవుతారు?’’ అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రశ్నించారు.

Related Posts