పరువు పేరుతో తెలంగాణలో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తాడికల్కు చెందిన గడ్డి కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. తాడికల్ శివారులోని వంకాయగూడెం గ్రామం వద్ద ఓ పత్తి చేనులో మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. కుమార్కు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో ఆ యువతి కుటుంబీకులే తమ కుమారుడిని హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.