YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రజల్లోకి పథకాలను విస్తృతంగా తీసుకెళ్లండి

ప్రజల్లోకి పథకాలను విస్తృతంగా తీసుకెళ్లండి

- భాజపా ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం 

 కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆయన భాజపా ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్‌లో విపక్ష సభ్యులు కొత్త సంప్రదాయానికి తెరలేపారన్నారు. రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలిపే ప్రధాని ప్రసంగానికి అడ్డుపడకూడదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యం సంస్కృతికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు ఒకరకంగా, లేనప్పుడు మరోరకంగా వ్యవహరిస్తున్నారని మోదీ మండిపడ్డారు.

Related Posts