YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

5 పరుగులకే నిష్ర్కమించిన రోహిత్

5 పరుగులకే నిష్ర్కమించిన రోహిత్

- తొలి వికెట్ కోల్పోయిన భారత్

ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో వన్డేలో తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (13 బంతుల్లో 1 ఫోర్) 5 పరుగులకే నిష్ర్కమించాడు. సౌతాఫ్రికా బౌలర్ రబడా బౌలింగ్‌‌లో అతడికే క్యాచ్ ఇచ్చి రోహిత్ తొలి వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. వరుస వన్డేల్లో విఫలమవుతున్న రోహిత్ శర్మ.. నాల్గో వన్డేలో కూడా పేలవ ప్రదర్శనతో రాణించలేకపోయాడు. రోహిత్ స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి (1), మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (23 బంతుల్లో 3 ఫోర్) 24 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా ఒక వికెట్ తీసుకున్నాడు. 

Related Posts